తేది: సెప్టెంబర్ 10, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- ప్రవరుఁడు పాదలేపము కొఱకు సిద్ధుని వేడుకొనుట
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా ప్ర-వ-రు-డు ఉండాలనగా
నేను రాసిన పద్యము
ప్రవరుఁ డిటు వేడె సిద్ధునిఁ "బరమపురుష!
వరయుతౌషధసిద్ధ! సత్పథగ! ఘన! క
రుణనుఁ బాదలేపమ్మునుం ద్రుతము నొసఁగుఁ
డు! ననుఁ దీర్థయాత్రాచరుఁ డుగనుఁ గనుఁడు!"
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి