తేది: ఆగస్టు 25, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
దెస-నస-పస-వెస పదాల స్వార్థాన్ని విడచి
స్వేచ్ఛాఛందంలో
రామాయణార్థంలో
పద్యం రాయమనగా
నేను రాసిన రెండు పద్యాలు
౧. శ్రీరాముఁడు శివధనువుం ద్రుంచిన తఱి నిద్దఱు స్త్రీలు సంభాషించుకొను సందర్భము...
ప్రజకు సంతోష మిదె సత్వరముగఁ గూర్చె;
శంకరుని విల్లుఁ ద్రుంచిన సత్వఘనుఁడు
జానకిన్ వెఱఁగుపఱుప సరభసముగఁ
గరము గ్రహియించె నటఁజూవె సరసిజాక్షి!
*** *** ***
౨. రావణుని దురాగతము...
కాదె సకలమహితము? లంకాధిపుండు
భూజ నసమంజసమ్ముగా మ్రుచ్చిలించి
తన యశోకవనమ్మున సదనుజ కృత
బంధితనుఁ జేసెఁ జూవె సద్బ్రహ్మకులుఁడు!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి