తేది: డిసెంబర్ 30, 2013 నాటి శంకరాభరణంలోని
దత్తపది శీర్షికన ఇచ్చిన
చెక్కు-సైను-మనీ-డ్రా పదాలను ఉపయోగించి,
దత్తపది శీర్షికన ఇచ్చిన
చెక్కు-సైను-మనీ-డ్రా పదాలను ఉపయోగించి,
భారతార్థంలో నచ్చిన ఛందంలో రాయమనగా
నేను రాసిన తేటగీతి
(బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించగా, ద్రుపదమహారాజు మెచ్చుకొన్న సందర్భము)
"నేనె విలుకాఁడఁ జూడుఁ"డంచెక్కుపెట్టి,
సొగసై, నునుపైన విశుద్ధ మత్స్య
యంత్రమునుఁ గొట్ట, "నెంత నియమమ నీకు,
బ్రాహ్మణా!"యనె ద్రుపదరా, డ్రాజసమున!
(చివరి పాదమును బ్రాహ్మణా!" యనె ద్రుపదరా, డ్రామ నిడుచు! అని కూడా చదువుకొనగలరు)