Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 04, 2016

పద్య తెలంగానం...

మిత్రులందఱకు నమస్సులు!

తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ఆవిర్భావదినోత్సవాలలో భాగంగా
రేపు (5-6-2016 నాడు)
తెలంగాణ ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖ, ‘తెలంగాణ పద్యకవితా సదస్సు’ అధ్వర్యంలో
‘పద్య తెలంగానం’ పేరుతో వివిధ జిల్లాలనుండి ఎన్నుకున్న 116 మంది పద్యకవుల సమ్మేళనం, సన్మానం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరుగనున్నది.
ఉదయం తొమ్మిది గంటలనుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కవుల కవితాగానం. తదుపరి ఆ కవులకు సత్కారం.
ఆ సమ్మేళనంలో ఒక పద్యకవిగా పాల్గొనడానికి నాకు అవకాశం లభించిందని తెల్పడానికి సంతోషిస్తున్నాను. నాతో పాటుగా వరంగల్ లోని మా "కాకతీయ పద్య కవితా వేదిక" బృందం లోని మరి కొందరు కవులకు కూడా ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడానికి అవకాశం లభించింది. వారి వివరాలు....

వరంగల్లు కవుల బృందానికి సమన్వయ కర్త: శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు

01. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు
02. ఆరుట్ల భాష్యాచార్యులు
03. కంది శంకరయ్య
04. గుండు మధుసూదన్
05. పిట్టా సత్యనారాయణ
06. జీడికంటి శ్రీనివాస మూర్తి
07. బీటుకూరు శేషుకుమార్
08. పాతూరి రఘురామయ్య
09. ఎన్.వీ.ఎన్.చారి
10. పల్లేరు వీరస్వామి
11. అక్కెర సదానందా చారి
12. చేపూరు శ్రీరామారావు

ఇట్లు
భవదీయుఁడు
మధురకవి
గుండు మధుసూదన్
వరంగల్

2 కామెంట్‌లు:

  1. మధుర కవుల స్వరములన్
    మధురిమ ఆ ఓరుగల్లు మాన్యుల గానన్
    సుధగన రవీంద్ర భారతి
    సదనము జేరెన్ జిలేబి చక్కని చుక్కా !

    రిప్లయితొలగించండి