Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, డిసెంబర్ 25, 2014

దత్తపది: యేసు-చర్చి-సిలువ-మేరీ...మతసామరస్యం...నచ్చిన పద్యం...

క్రైస్తవ సోదరులందరికీ
క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు!

తేది: డిసెంబర్ 25, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
యేసు - చర్చి - సిలువ - మేరీ

పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
మతసామరస్యం గురించి
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన తేటగీతి పద్యం:





సమతయే సుఖశాంతులు మమత లొసఁగు
ననియ చర్చిలు మతపెద్దలంద ఱిటులె
యెపుడు నడువ, భాసిలు వక్తలే యగుదురు!
పర మత జన మే రీఢయు ౙరుప దెపుడు!!
(చర్చిలు=చర్చింౘు, రీఢ=అవమానము, తిరస్కారము)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి