Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, అక్టోబర్ 26, 2014

నిషిద్ధాక్షరి: సరళాక్షర నిషేధం...గాంధీజీ స్తుతి...నచ్చిన ఛందస్సులో...



తేది: అక్టోబర్ 02, 2014 నాటి శంకరాభరణంలోని
నిషిద్ధాక్షరి శీర్షికన
సరళాక్షరము(గ-జ-డ-ద-బ)లను ఉపయోగించకుండా

గాంధీజీని స్తుతిస్తూ
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా

నేను రాసిన
సీసపద్యము మఱియు తేటగీతి




మదీయ ప్రథమ పూరణము::
సీ.
నెత్తిపై పిలకతో, నిర్మలమ్మౌ ముఖ
      మ్మున ధీరశాంతముల్ మొనయ నిచట
నల తెల్లవారి కార్యావర్త పరిహార్య
      మౌటకై నీ వహింసాస్త్రము ధరి
యించియు నని సేసి, యేకమౌనటు సేయ
      ప్రాంతీయులను భవ్యవాక్ప్రతతుల
నాసేతుశీతాచలాంతర సంచారి
      వైతి మేల్కొలుప నీ వనవరతము

గీ.
తెల్లవారల పాలన తెల్లవాఱ
నీ వహింసాయుత సమర నేతవయ్యు
భారతీయ స్వతంత్రతా వర్తనకయి
హే భరతమాత సత్పుత్ర, హితవర, పిత,
తెల్లవారి నంపితివి మా యుల్ల మలర!!



మదీయ ద్వితీయ పూరణము:
తే.గీ.
శాంత్యహింసాయుధధుర్య! సత్యకోప!
శ్వేతముఖపలాయిత! చిత్రవేషధారి!
భరతమాత సత్పుత్రక! భరతవర్ష
పిత! మహాత్మ! నమో
స్తుతే విమల చరిత!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి