Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఏప్రిల్ 04, 2014

పద్య రచన: సత్య హరిశ్చంద్రుఁడు

తేది: ఆగస్టు 12,2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు


ఇంద్ర సత్సభా ప్రకటిత హేతు బలిమి
గాధి నందనుఁ డే రాజు గతిని మార్చె?
నా హరిశ్చంద్రుఁ డిడుముల నైన వలచి,
సత్యవా క్పాలనమ్మును సడల నీఁడు!

ఋణమునుఁ దీర్పఁగ నిజసతి
గుణమతి యా చంద్రమతినిఁ గోరియు నమ్మన్ ;
బ్రణతు లిడి, సుత సహిత విత
రణకై బలియయ్యె సాధ్వి, రమణుని యానన్!

సుతుఁడు లోహితుండు సుగుణవంతుఁ డెదలో
హితుఁడు, జనకు నాజ్ఞ నేమరకయె,
జనని ననుసరించె, జనలోక వంద్యుండు,
భావి యౌవ రాజ్య భారకుండు!

***     ***     ***     ***     ***     ***


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి