Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఆగస్టు 15, 2016

సాహితి సవ్వడి (పద్యాల సవ్వడి) వారి ఇ పేపర్‌లో నా పరిచయం



"సాహితీ సవ్యసాచి" గుండు మధుసూదన్

వరంగల్: ప్రముఖ పద్యకవి, రచయిత గుండు మధుసూదన్


వరంగల్ జిల్లాలోని గిర్మాజీపేట గ్రామంలో గుండు మల్లికాంబ, రామస్వామి లకు అష్టమ సంతానంగా జన్మించిన గుండు మధుసూదన్ పద్యకవిగా తెలుగు సాహితీలోకంలో సుపరిచితులు. ఒకవైపు అధ్యాపకులుగా విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతూనే, మరోవైపు తన ప్రవృత్తి అయిన పద్య సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో రచనలు చేస్తూ, ఇప్పటివరకు దాదాపు రెండువేలకు పైగ పద్యాలు రాసిన తాను, అనేక అంతర్జాల బ్లాగుల్లోనూ, వాట్సప్, ఫేస్ బుక్ తదితర వేదికల్లో అనేక రచనలు చేస్తూనే, ఇంకెందరికో మార్గదర్శనం చేస్తున్న గుండు మధుసూదన్ గారికి చిత్రలేఖనంలో కూడా ప్రవేశముంది. పాటలుకూడా పాడతారు. తెలుగు సాహితీ ప్రపంచంలో భాష మనుగడకోసం నిరంతరం కృషిచేసే "సాహితీ సవ్యసాచి", మన తెలంగాణతల్లి ముద్దుబిడ్డ గుండు మధుసూదన్.

మధుసూదనుని కలంనుండి జాలువారిన రచనలు:
1. వేయికి పైగా పద్యరూప సన్మాన పత్రములు
2. సూక్తి ముక్తావళులు (పద్యాలు)
3. "హరి" శతకము, "తెలుగు బాల" శతకము
4. పెక్కు దేవతా స్తుతులు, ఖండ కావ్యాలు
5. వేయికిపైగా సమస్యాపూరణలు, దత్తపదులు, నిషిద్ధాక్షరులు, న్యస్తాక్షరులు, వర్ణనలు, మొ.,
6. బాలల నీతి పద్య కథలు (సులభ శైలిలో)


సన్మానాలు - పురస్కారాలు:
1. ఆంధ్ర పద్య కవితా సదస్సు, శ్రీలేఖ సాహితి, సహృదయ సాహితి వారలచే పద్యకవిగా సన్మానం.
2. రాష్ట్రభాషోపాధ్యాయ సంస్థ, బహుజన ఉపాధ్యాయ సంఘం వారలచే జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.
3. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన "పద్య తెలంగానం" లో పద్య కవిగా సన్మానం.
4. అయుత కవితా యజ్ఞంలో వేయికి పైగా పద్య కవితలను ప్రకటించినందుకు "తెలుగు కవితా వైభవం, హైదరాబాదు" వారిచే "సహస్ర కవి భూషణ" మొ. బిరుద ప్రదానం, సన్మానం.
5. పోతన జయంత్యుత్సవాల సందర్భంగా "తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారిచే ఓరుగల్లు పద్యకవిగా బమ్మెర గ్రామంలో సన్మానం.
6. "పద్యాల సవ్వడి" లో పద్యాలతో సాహితి సవ్వడి చేస్తున్న మధురకవి గుండు మధుసూదన్ గారు "గురజాడ ఫౌండేషన్, అమెరికా" వారి "తెలుగు కవిత పురస్కారం-2016" కు ఎంపికైనారు.


-చిన్ననాటి నుంచే తెలుగు సాహిత్యం పైన మక్కువ
-వృత్తి అధ్యాపకుడు -ప్రవృత్తి సాహిత్యం
-రెండు వేలకు పైగా పద్య రచనలు
-ఎన్నో పురస్కారాలు, బిరుదులు

పద్యం ద్వారానే తెలుగు భాషకు పునర్వైభవం: మధురకవి గుండు మధుసూదన్
తెలుగుభాషకు పునర్వైభవం తెలుగు పద్యం ద్వారానే సాధ్యమవుతుంది. మన తెలుగు మృతభాషగా మారకూడదంటే...పద్యాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి. తెలుగు పద్యం రక్షింపబడితేనే, తెలుగుభాష రక్షింపబడుతుంది. సాంప్రదాయికమైన తెలుగుభాష పద్యాలలోనే ఉంది. కాబట్టి ప్రతి తెలుగువాడూ పద్యాన్ని రాయాలి, ఆదరించాలి, పద్యం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి.
స్వస్తి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి