Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మే 02, 2015

దత్తపది: రామ-భరత-లక్ష్మణ-శత్రుఘ్న...భారతార్థంలో...నచ్చిన ఛందంలో...

తేది: జనవరి 06, 2015 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన

రామ - భరత - లక్ష్మణ - శత్రుఘ్న
పదాలను ఉపయోగిస్తూ

భారతార్థంలో
నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన కంద పద్యము మరియు తేటగీతి పద్యములు




(దుర్యోధనుని ఘోషయాత్ర....)

కందపద్యము:
రామగతులుఁ బాండుకు
మారులునౌ భరతకులుల మానము డుల్పన్
జేరెను లక్ష్మణ యుతుఁడై
రారాట్ శత్రుఘ్నునంచు రంజిలుచు వెసన్!


తేటగీతి:
ఏ విరామ మెఱుంగని హీన యోచ
నాస్థ లోభరతుఁడు కౌరవాగ్రజుండు
లక్ష్మణునిఁ గన్నతండ్రి దుర్లక్షణుండు
విఘ్నమిడఁగా వనిఁ జనె శత్రుఘ్నులకును!
(శత్రుఘ్నులు=శత్రునాశకులైన పాండవులు)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి