Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, అక్టోబర్ 30, 2014

దత్తపది: గోలి - గుండు - మంద - మల్లెల...రామాయణార్థంలో...నచ్చిన ఛందస్సులో...

తేది: అక్టోబర్ 06, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
గోలి - గుండు - మంద - మల్లెల
(ఇవి శంకరాభరణం బ్లాగులో తఱచుగా పూరణలు రాసే కవుల యింటిపేర్లు)
పదాలను ఉపయోగిస్తూ రామాయణార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన తేటగీతి మఱియు మత్తేభవిక్రీడితము

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

(మహర్షి విశ్వామిత్రుఁడు శ్రీరామునిం దాటకనుఁ బరిమార్చుటకై పురికొల్పుచుఁ బలికిన సందర్భము)

తే.గీ. (పంచపాది):
"తాటకి యదిగో! లిప్తయందది కనఁబడి,
మదినిఁ గలగుండు వడఁగాను మాయమగుచు,
మునులు భయమందనఱచుచుఁ గనలుచుండె!
క్షిప్రమే కాండ మల్లె లక్షించి దానిఁ
గూల్చు మోరామచంద్ర! సంకోచ మేల?" (1)

***          ***          ***          ***          ***

(సీతాదేవియొద్ద గోలచేయుచున్న రాక్షస వనితల నుద్దేశించి త్రిజట హనుమంతునిం బొగడుచుఁ బలికిన సందర్భము)

మత్తేభము:
"మన గోలిట్టుల నుండనిండు! మనమా మాన్యం బ్రతారించినన్,
హనుమంతుం డట రామనామజపితోద్యన్మంగళాంగుండునై,
జనకాత్మోద్భవ హర్షమంద నపుడా చందాన రామోర్మికన్
వినుతుల్ సేయుచు వేగ నీన్, గురిసె తీవెల్ మల్లె లవ్వీరుపైన్!!" (2)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి